22-07-2025 05:51:22 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల(Telangana Social Welfare Womens Degree College)లో మంగళవారం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక చోట కూర్చొని ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి అనూష గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి సునీత, ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారులు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.