2 July, 2026 | 11:35 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

రియల్ ఎస్టేట్ దళారిలా ప్రభుత్వం

07-04-2025 01:16 AM
  1. కంచ గచ్చిబౌలి భూముల రక్షణకు చేతులు కలపండి
  2. విద్యార్థులకు, పర్యావరణవేత్తలకు కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రియ ల్ ఎస్టేట్ దళారిలా మారి, ఎకోపార్క్ అంటూ భూములు కాజేందుకు కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు కలసిరావాలని విద్యార్థులు, పర్యా వరణవేత్తలకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

ఎన్నో రకాల వృక్ష, జంతుజాలం ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు దేశంలోని అన్ని రంగాల ప్రముఖులు కలసి వచ్చారని చెప్పారు. నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకునేందుకు పూర్తిస్థాయి పోరాటం చేయాలని కేటీఆర్ అన్నారు. ఈ భూముల రక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదన్నారు.