1 July, 2026 | 7:21 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి

01-07-2026 06:33 PM

– జిల్లా సహకార అధికారి కరుణాకర్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతానికి సహకార సంఘాలు మరింత సమర్థంగా పనిచేయాలని జిల్లా సహకార అధికారి కరుణాకర్ అన్నారు. భారత ప్రభుత్వ సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS), ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పైలట్ ప్రాజెక్టు కింద కంది విత్తన ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు)లో సభ్యత్వం తీసుకొని డ్రోన్ సేవలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాబార్డ్ ప్రతినిధులు, జిల్లా నాబార్డ్ మేనేజర్ వీరభద్రుడు, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, జిల్లా సహకార సంఘాల ప్రతినిధులు, సెక్రటరీలు, రైతులు పాల్గొన్నారు.