29-05-2025 02:14:40 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, మే 28 (విజయ క్రాంతి), ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల తో సమీక్ష నిర్వహించారు.
సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు జిల్లాస్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు , మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, APMs, APOs లతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, ఉపాధి హామీ నీటి సంరక్షణ పనుల అంశాలపై సమీక్షించారు.
రాజీవ్ వికాసం లో 50,000 అదేవిధంగా ఒక లక్ష రుణాలు ఎంపిక రేపటి లోపు పూర్తిచేయాలని అన్నారు, నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. వన మహోత్సవం కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.