24-06-2025 01:38:25 AM
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవా రం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన జైబాపు, జైసంవిధాన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జైబాపు, జై సంవిధాన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, రా జ్యాంగ పరిరక్షణ కోసం జైసంవిధాన్ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని దిశానిర్దేశం చేశారు. తాను కూడా ఉమ్మడి 10జిల్లాలో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సం క్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులపై ఉందన్నారు.
నియోజకవర్గం నాయకు లు కూడా గ్రామాల్లో రాత్రిబస చేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పా ర్టీ సామాజికన్యాయానికి కట్టుబడి ఉందని, దాని ఆధారంగానే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో పదవుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. సమా వేశంలో ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శి విశ్వనాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్రెడ్డి పాల్గొన్నారు.
నేడు టీపీసీసీ కీలక సమావేశాలు..
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో మంగళవారం కీలక సమావేశాలు జరగను న్నాయి. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.