17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించాలి

05-04-2025 12:18 AM

సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్

వారసిగూడ, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : ప్రభుత్వ స్కూల్‌లను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాల్సి ఉందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. దూద్‌బావిలోని చిలకలగుడా ప్రైమరీ స్కూల్ లో రానున్న విద్యా సంవత్సరానికి ప్రవేశాల కరపత్రాలను పద్మారావు గౌడ్ శుక్రవారం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్‌లలో వివిధ సదుపాయాలను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, సికింద్రాబాద్ లో పేద విద్యార్ధులకు ఉపకరించేలా జూనియర్, డిగ్రీ కాలేజీలను సాధించుకున్నామని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణా నికి సైతం చురుకుగా ఏర్పాట్లు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సైతం తమ స్కూల్‌లలో విద్యార్థుల సంఖ్య ను పెంచుకొనేందుకు, మెరుగైన ప్రమాణాలకు కృషి చేయాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్ర మంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ పాల్గొన్నారు.