22-09-2025 12:08:51 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, సెప్టెంబర్ 21 :సర్కారు దవాఖానాల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో వి శ్వాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రామాయంపేట మండల పరిధిలో డి.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆస్పత్రిలోని రక్త పరీక్షల గది, ఎక్స్ రే, ల్యాబ్ గదులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎవరెవరు ఏ రుగ్మతతో వచ్చారని వాకబు చేశారు. ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు, ఇప్పటి వరకు జరిగిన ప్రసవాల వివరాలను చూశారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నమోదు,సాధారణ ప్రసవాలు, సిజరిన్ లు ఎన్ని జరిగాయని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.