28-05-2025 12:13:31 AM
మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్ని మీడియా సంస్థల వార్తలు ప్రసారం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు.
యాసంగి కోతలు పూర్తయి వానాకాలం వచ్చినప్పటికి నెలల తరబడి కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న అన్నారు. ధాన్యం కొను గోళ్లలో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నా రైతుల అభ్యంత రాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
మిల్లర్లను ప్రశ్నిస్తే ది క్కున్న చోట చెప్పుకోమంటున్నారని, సీఎం ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదంటే అసలు పాలన మీద పట్టుందా అనే సంశయాలు వస్తున్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిని దబాయిస్తున్నారని, వారి మీద కేసులు పెట్టి వేధిస్తున్నా రని ఆయన ఆరోపించారు.
తమ హాయంలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహించామని, 60 లక్షల ఎకరాలలో వరి సాగు నుం డి 20 లక్షల వరకు ఇతర పంటల వైపు మల్లాలని చైతన్యం చేశామని నిరంజన్ చెప్పారు.