15 March, 2026 | 6:22 PM

Breaking News

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •  

సర్పంచ్‌గా జీపీ ట్రాక్టర్ డ్రైవర్ పోటీ

03-12-2025 12:33 AM

-రిజర్వేషన్లతో పళ్లెం లింగంకు కలిసి వచ్చిన అవకాశం 

-మద్దతిచ్చిన అధికార పార్టీ నేతలు

-కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఘటన

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రిజర్వేషన్ల పు ణ్యమా అని గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తు న్న వ్యక్తికి సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం దక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో చోటు చేసుకుంది. రిజ ర్వేషన్ల వల్ల రాజకీయాల్లో సముచిత స్థానం లభిస్తుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం పోసానిపేట పంచాయితీలో సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ కావడంతో జీపీ ట్రాక్టర్ డ్రైవర్ పళ్లెం లింగం పోటీ చేస్తున్నారు. లింగం గ్రామస్తులందరితో కలుపుగోలుగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతిచ్చి సర్పంచ్‌గా నిలబడితే గెలుపు సునాయాసమవుతుందని గ్రామస్తులు భావించారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి స్థానిక కాంగ్రెస్ నాయకులు జీపీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి పార్టీ మద్దతి ఇస్తే సర్పంచ్ గా సునాయాసంగా గెలుస్తారని చెప్పడంతో ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించారు. ఆయన ఎన్నికల్లో గెలుపొందితే సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.