15 March, 2026 | 7:56 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

మేకలు అమ్మి నామినేషన్

03-12-2025 12:32 AM

-ప్రజాసేవ కోసమే నిర్ణయం

-కామారెడ్డి జిల్లా ఎండ్రియాల సర్పంచ్ అభ్యర్థి గంగయ్య

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): సర్పంచ్‌గా పోటీ చేసి ప్రజాసేవ చేయాలని భావించిన ఓ మేకల యజమాని తనకున్న వాటిలో పదింటిని అమ్మి, ఆ డబ్బుతో సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎండ్రియాల గ్రామానికి చెందిన మేకల కాపరి గంగయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

అందుకోసమే తనకున్న మేకలలో 10 మేకలను అమ్మకానికి పెట్టాడు. మేకలను అమ్మగా రూ.50 వేలు వచ్చాయి. తన అనుచరులతో కలిసి మంగళవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనతో పాటు వార్డు సభ్యులను బలపరచడానికి ఆఫిడవిట్లకు కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. నామినేషన్ల కోసం డబ్బులు చెల్లించారు. సర్పంచ్ ఎన్నికల్లో గంగయ్య సంకల్పం నెరవేరుతుందా లేదా ఎన్నికల తర్వాత తెలియనుంది.