29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

కారోబార్ నుంచి సర్పంచ్‌గా..

03-12-2025 12:35 AM

వరంగల్ జిల్లా మురిపిరాలలో ఏకగ్రీవంగా ఎన్నిక

మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఆరేళ్లుగా గ్రామ పంచాయతీలో కారోబార్‌గా విధు లు నిర్వహిస్తూ, సర్పంచు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన కారోబార్.. అనూహ్యంగా సర్పంచ్ అభ్యర్థి కావడమే కాకుండా గ్రామస్థుల ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో ఇప్పటివరకు కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్న పెదగాని నాగరాజు సర్పంచ్ అయితే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని భావించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చి నాగరాజును ఏకగ్రీవ సర్పంచుగా బలపరిచారు.

దీనితో గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డు సభ్యుల పదవులను కాంగ్రెస్ మూడు, బీఆర్‌ఎస్ మూడు, బీజేపీ రెండు తమ పార్టీకి చెందిన సానుభూతిపరులకు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు ఏకగ్రీవంగా వార్డు సభ్యులను కూడా ఎంపిక చేసి ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే వేయించారు. బుధవారం అధికారులు ఎన్నికను అధికారులు లాంఛనంగా ప్రకటించనున్నారు.