10-05-2025 06:19:48 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి, కుల పెద్దమనిషి ఆరెపల్లి గట్టయ్య, పోతర బోయిన వెంకన్న, కుంట వెంకన్న, ఉప్పలయ్య, శ్రీను, తాడబోయిన నరేష్, సింగని రాజు, జొన్నవాడ కుమార్, రాజు, సుధాకర్, వీరయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.