7 March, 2026 | 3:20 PM

వైభవంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమిపూజ

07-03-2026 12:00 AM

కాగజ్‌గర్, మార్చి 6 (విజయక్రాంతి): పట్టణంలోని ఆర్‌ఆర్‌ఓ కాలనీలో శుక్రవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాల య పునర్నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవ క్త ఆచార్యులు అనంతశ్రీ విభూషిత త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి గోవింద క్షేత్రంగా నామకరణం చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు ముం దుకొచ్చి సహకారం అందిం చారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వా యి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.