3 July, 2026 | 9:06 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

03-07-2026 08:19 PM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి,ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే పోచారం నివాసం వద్ద శుక్రవారం బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్థులు 122 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపట్టాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామని వారి పేరు మీద ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగిందన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో  సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశామని మిగిలిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. పిల్ల పట్టాలను అందజేసినందుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, బీర్కూర్ తహసీల్దార్ సవాయి సింగ్, బాన్సువాడ పట్టణ, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.