19-06-2025 04:42:44 PM
డిఆర్డిఓ సురేందర్...
కామారెడ్డి (విజయక్రాంతి): భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డిఓ పిడి సురేందర్(DRDO PD Surender) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా దోమకొండ బైపాస్ చౌరస్తాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రూప్ టాప్, నీటి గుంతల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి కోసం, వర్షపు నీటిని ప్రతి నీటిబిందువు సంరక్షించుకోవడానికి రూప్ టాప్ పనులను ఎన్ఆర్ఈజీఎస్ సహకారంతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా దక్షిణ ప్రాంగణంలోని మొత్తం క్యాంపస్ ను జాగ్రిఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(Geographic Information System) టెక్నాలజీ ఉపయోగించి, క్యాంపస్ ఆవరణలో వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లను, సోప్ పిట్లను, చిన్న రాతి డ్యాములను, పర్కులేషన్ ట్యాంకులను, చిన్నపిల్ల కాలువలను, వర్షపు నీటి గుంటలను గుర్తించి పనులను ప్రారంభించారు. రాబోయే వన ఉత్సవంలో కార్యక్రమంలో దక్షిణ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఈ సందర్భంగా దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు నీరు ఎంతో విలువైనదని, వర్షపు నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిక్నూర్ ఏపీవో రాధిక, టెక్నికల్ అసిస్టెంట్ తిరుపతి, లక్ష్మీనారాయణ, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ ప్రతిజ్ఞ, హాస్టల్ వార్డెన్ డాక్టర్ యాలాద్రి, డాక్టర్ ఎస్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.