06-11-2025 07:20:52 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ/ స్థానిక సంస్థల/ ఎయిడెడ్/ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమ సంబంధిత ఫోటోలు, వివరాలతో అదే రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.