15 June, 2026 | 10:19 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గ్రూప్ గిరిజన విద్యార్థి రేవన్ ప్రతిభ

20-12-2025 12:44 AM

చారకొండ, డిసెంబర్ 19: గ్రూప్ 3లో గిరిజన యువకుడు సబావత్ రేవన్ సత్తా చాటి క్రీడా శాఖలో జూనియర్ అనిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మండలంలోని మర్రిపల్లి గ్రామ పంచాయతీ బోడబండ తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సబావత్ దేవీలాల్ చౌహాన్, చారకొండ మాజీ సర్పంచి శిల్పాదేవిలాల్ కుమారుడైన రేవన్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాడు.

మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 3 లో 2,203 ర్యాంక్ సాధించి జూనియర్ అనిస్టెంట్ కు ఎంపికయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో మండల వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు రేవన్ ను అభినందించారు.