07-06-2025 12:00:59 AM
హనుమకొండ,(విజయక్రాంతి): ఉదయం గుండె పోటుతో పరమపదించిన హనుమకొండ మండల తహసీల్దార్ కర్ర శ్రీపాల్ రెడ్డి భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళీలు అర్పించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విధి నిర్వహణలో నిత్యం ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేసిన శ్రీపాల్ రెడ్డి మరణ వార్త చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అలాగే కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అడిషనల్ కలెక్టర్, తహసీల్దార్ లు, ఇతర అధికారులు, తదితరులు నివాళులర్పించారు.