19 April, 2026 | 2:41 AM

ముస్లింలకు పాలిథిన్ కవర్ల పంపిణీ

07-06-2025 12:00 AM

బక్రీద్ సందర్భంగా అందజేసిన డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి దంపతులు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): బక్రీద్‌ను పురస్కరించుకొని డిప్యూటీ మేయ ర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు మోతె శోభన్‌రెడ్డి తార్నాక డివిజన్‌లోని వారి నివాసం వద్ద శుక్రవారం ముస్లింలకు పాలిథిన్ కవర్లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకై జంతు వ్యర్థాలను పరిసరాల్లో పడేయకుండా పాలిథిన్ కవర్లలో పెట్టి రోజువారీగా చెత్త సేకరించే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ డీఈ వెంకటేష్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.