13-05-2025 12:00:00 AM
నందమూరి తారక రామారావు ముని మనవడు, హరికృష్ణ మనవడు, జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త ప్రాజెక్టును న్యూ టాలెంట్ రోర్స్ ఏ బ్యానర్పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఈ సినిమా ద్వారా యువ కూచిపూడి నర్తకి వీణారావు కథానాయికగా పరిచయం అవుతోంది.
ఈ సినిమా ముహూర్తం షూట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి అతిథులుగా హాజరయ్యారు. మరికొందరు నందమూరి కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘ఈ యువ నందమూరి తారక రామారావు అతని ముత్తాత నందమూరి తారక రామారావులాగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా.
నాలుగో తరం ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉంది. రామ్ తన ప్రతిభను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కసి ఉన్న వ్యక్తి కచ్చితంగా కోరుకున్న స్థాయికి ఎదగగలడు’ అన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘కళాకారుడు ఎంతో తపస్సు చేయాలి. కళామతల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. మా నాన్న ఒక కళాతపస్వీ. ఆయన క్రమశిక్షణతో చలనచిత్ర రంగానికి జీవితాన్ని అంకితం చేశారు.
అందుకే ఆయన పేరును భారతీయ సినీరంగంలో సువర్ణాక్షరాలతో లిఖించారు. మేమంతా రామ్ అని పిలుచుకునే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్కు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి’ అన్నారు. హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నా’ అన్నాడు. ‘ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని హీరోయిన్ వీణారావు తెలిపింది.
డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ ఘాట్ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఎన్టీఆర్ అభిమానులకు ఇదొక శక్తినిచ్చే స్థలం. తెలుగు జాతి ఉన్నంతవర కూ ఆయన ఉంటారు. ఎన్టీఆర్ పేరు ఎవరైనా పెట్టుకుంటారు.. కానీ ఆ రంగంలో రాణించగలగాలి.
తెలుగు సాహి త్యం, సంప్రదాయం, హైందవ సంస్కృతి నేపథ్యంలో నా శా యశక్తులా కష్టపడి మంచి కథను తయారుచేశాను. అది ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కష్టపడి పనిచేస్తాం. మా కష్టాన్ని చూడండి’ అన్నారు. ఈ సినిమాను విజయవంతంగా విడుదల చేస్తాం’ అని నిర్మాత గీత అన్నారు.