13-05-2025 12:00:00 AM
టాలీవుడ్లో నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘ఎం4ఎం’. ఈ సినిమాకు ఇప్పుడు అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 17న ప్రైవేట్ స్క్రీనింగ్ కానుందీ సినిమా. అమెరికన్ నటి జోశర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది.
ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘మా సినిమాను కేన్స్లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం. హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో హంతకుడెవరో ఊహించిన వారికి వెయ్యి డాలర్లు, లేదా రూ.లక్ష బహుమతి ఇస్తాం’ అని తెలిపారు.