calender_icon.png 1 June, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్స్ ఫెస్టివల్‌లో ఎం4ఎం స్క్రీనింగ్

13-05-2025 12:00:00 AM

టాలీవుడ్‌లో నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘ఎం4ఎం’. ఈ సినిమాకు ఇప్పుడు అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మే 17న ప్రైవేట్ స్క్రీనింగ్ కానుందీ సినిమా. అమెరికన్ నటి జోశర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది.

ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘మా సినిమాను కేన్స్‌లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం. హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో హంతకుడెవరో ఊహించిన వారికి వెయ్యి డాలర్లు, లేదా రూ.లక్ష బహుమతి ఇస్తాం’ అని తెలిపారు.