13-05-2025 12:00:00 AM
కిరణ్, ఆలేఖ్యరెడ్డి నాయకానాయి కలుగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. ఆక్సాఖాన్, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వం వహిస్తూ ఆర్కే ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై పీ అశోకుమార్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, జూన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “మైథలాజికల్ టచ్ను రూపొందుతున్న ఈ చిత్రం మా బ్యానర్లో 41వ చిత్రమిది. దీని తర్వాత ‘కబడ్డీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అని చెప్పారు. హీరో కిరణ్, నటీనటులు ఆక్సాఖాన్, తులసి, రోహిత్శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్కిరణ్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.