16 March, 2026 | 8:48 AM

బీఆర్‌ఎస్ నాయకులపై దాడి ఘటనను ఖండించిన హరిప్రియ

16-03-2026 12:01 AM

ఇల్లందు టౌన్, మార్చి 15, (విజయక్రాంతి): ఇల్లంద మండలం తిలక్నగర్ గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ నాయకులపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ ఖండించారు. రోడ్డు పనుల్లో నాణ్యతపై ప్రశ్నించినందుకు సర్పంచ్ ధనసరి స్రవంతి భర్త రాజు బీఆర్‌ఎస్ నాయకులపై దాడి చేశారని ఆరోపించారు. గాయపడిన వారిపైనే కేసులు నమోదు చేయడం పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శీలం రమేష్, ఘాజీ, విజయ్ కుమార్, గుదిబండ్ల శ్యామ్, సదరం చిన్నారి తదితరులు పాల్గొన్నారు.