25 March, 2026 | 5:58 AM

హరీష్‌రావు అది మర్చిపోయావా?

04-07-2024 02:01 AM

పీసీసీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధేశ్వర్ 

హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు నిధులు రాకుండా దారి మళ్లించి ఆనాడు పాలించిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను రోడ్డున పడేసిందని టీపీసీసీ పంచాయతీ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధేశ్వర్ విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో  గ్రామాల్లో  సొం త నిధులతో అభివృద్ధి చేసి బిల్లుల కోసం సర్పంచ్‌లు  బిక్షాటన చేసిన విషయాన్ని హరీష్‌రావు మర్చిపోయారా..? అని ఆయన  నిలదీశారు. బుధవారం మాట్లాడుతూ.. బీఆర్‌ఎ స్ హయాంలోనే సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.