20 March, 2026 | 6:48 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మాదాపూర్‌లో హ్యాష్ ఆయిల్ కలకలం

20-03-2026 12:00 AM
  1. 920 గ్రాములు స్వాధీనం
  2. నిందితుడు దినేష్ అరెస్ట్
  3. పరారీలో మరో ఆరుగురు నిందితులు 

శేరిలింగంపల్లి,మార్చి 19 (విజయక్రాంతి): మాదాపూర్‌లో హ్యాష్ ఆయిల్ విక్రయానికి సిద్ధమవుతున్న నిందితుడిని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకుని 920 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీ, సిటీ వైన్స్ సమీపంలో నిర్వహించిన దాడిలో పరుసముల దినేష్ (28) అనే కారు మెకానిక్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 180 చిన్న బాటిళ్లలో నిల్వ ఉంచిన హ్యాష్ ఆయిల్ను స్వాధీ నం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడి నిర్వహించారు. ముసాపేట్‌కు చెందిన ప్రవీణ్ వద్ద నుండి డ్రై గంజాయి కొనుగోలు చేసి ఆయిల్గా మార్చి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యో గులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

ఈ కేసులో ప్రవీణ్, యూసుఫ్, శరత్, విన్ని, చందు, రేవంత్లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశా రు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.