1 July, 2026 | 8:44 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ గెయినర్

25-05-2024 12:53 AM

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.7 శాతం పెరిగి రూ. 1,528 వద్ద ముగిసింది. భారతి ఎయిర్‌టెల్, లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీలు 1.5 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.52 శాతం తగ్గింది. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.71 శాతం, ఐటీ ఇండెక్స్ 0.55 శాతం, మెటల్ ఇండెక్స్ 0.41 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.35 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.29 శాతం చొప్పున తగ్గాయి. ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్‌లు పెరిగాయి. మెటల్ ఇండెక్స్ నష్టంతో ముగిసింది. స్మాల్ క్యాప్ సూచి 0.20 శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.23  శాతం పెరిగింది.