09-06-2025 01:19:49 AM
వారాసిగూడ, జూన్ 8 (విజయక్రాంతి): జుబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాద్ మృతి పట్ల సికింద్రాబాద్ శాసన సభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల ప ద్మారావు గౌడ్ తీవ్ర దిగ్భంతిని వ్యక్తం చేశా రు. ఆయన కన్ను మూసిన సమాచారాన్ని జీరించుకోలేక పోతున్నానని పద్మారావు గౌడ్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు శాసనసభ్యునిగా విజయం సాధించి ప్రధానంగా పేద, అణగారిన, మై నారిటీ వర్గాల సంక్షేమానికి నిరంతరం మా గంటి శ్రమించారని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
తనకు సుదీర్ఘ కాలంగా వ్యక్తి గత అనుబంధం ఉందని, నిస్వార్ధంగా సేవలు అందించి స్థానిక ప్రజ లు, కార్యకర్తలు, అభిమానుల మన్ననలను ఆయన పొందారని తెలిపారు. మాగంటి మృతి పార్టీ కి తీరని లోటని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సాను భూతిని తెలిపారు. మా గంటి అందించిన సేవలు చిరస్మరనీయంగా నిలుస్తాయని తన సంతాప సందేశంలో పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.