21-06-2025 01:44:37 AM
తుర్కయంజాల్, జూన్ 20:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలో పురపాలక సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిం చారు. ప్రతి రోజూ ఒక చర్య... ఒక మార్పు 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాగన్నగూడలోని చలసాని కల్యాణ మం డపంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బందికి, మహిళా సంఘం సభ్యులకి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బీపీ, ఇతరత్రా పరీక్షలు చేసి మందులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేతలు సామ భీంరెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిత్యం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తూ, స్వచ్చ తుర్కయంజల్ కోసం పాటుపడుతున్న సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఆశించారు.
శానిటేషన్ మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఆర్వో శ్రీనివాస్, ఆర్ఐ బాలరాజు, కాంగ్రెస్ నేతలు రేవల్లె యాదగిరి, గోదాసు భద్రయ్య, డాక్టర్లు శృతి, శిరీష, అజిత్, ఆరోగ్య సిబ్బంది డి. లక్ష్మి నారాయణ, డి. నర్సింహ, జె. పద్మ, వజ్రమ్మ, స్వప్న, సాగర్, రఘుపతి, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.