21-06-2025 01:43:20 AM
బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 20 : ఈ నెల 22న నిర్వహిస్తున్న సంకల్ప సభకు బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీజేపీ కార్పొరేటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ నెల 22న వికసిత్ భారత్ 2047, ఎంపీగా ఈటల రాజేందర్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు నాయికోటి పవన్ కుమార్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, లచ్చిరెడ్డి తదితరులుపాల్గొన్నారు.