17 April, 2026 | 7:17 PM

భారీ వర్షం.. నీట మునిగిన పంటలు

11-04-2025 01:12 AM

సిరిసిల్ల, ఏప్రిల్10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లబారు జాము వరకు కురిసిన భారీ వర్షంతో  రైతన్న  అతలా కుతల మయ్యాడు..  జిల్లాలో సిరిసిల్ల, కోనరావుపేట,   గంబిరావు పేట , ఎల్లారెడ్డిపేట, రుడ్రంగి, వేములవాడ మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసింది.  వరద నీటికి రోడ్ల  పై అరవేసిన శాన్యం గింజలు కొట్టుకుపోయాయి.  జిల్లాలో 1000 ఎకరాల్లో కోతకు వచ్చిన పంట  నీట మునగగా వంద టన్నుల కు పైగా ధాన్యం  తడిసింది.