calender_icon.png 5 June, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈశాన్యంలో భారీ వర్షాలు

01-06-2025 12:00:00 AM

వరద గుప్పిట్లో గౌహతి, ఇంఫాల్ నగరాలు

న్యూఢిల్లీ, మే 31: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, అరుణా చల్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ప్ర వహిస్తుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గౌహతి, ఇంఫాల్ నగరాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పరిస్థితి అదుపుతప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపారు. అస్సాంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరదలతో అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఐదుగురు చనిపోయారు. మొత్తంగా 19 మంది చనిపోయినట్టు తెలుస్తోంది.

మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాన ల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లు కొట్టుకుపోగా, 12 వేల మంది నిరాశ్రయులయ్యారు.