01-06-2025 12:00:00 AM
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో స్టేకు నిరాకరణ
న్యూఢిల్లీ, మే 31: ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభ కో ణం కేసులో ట్రయల్ కోర్టు విచారణ జరగకుండా స్టే విధించాలంటూ ఆ యన దాఖలు చేసిన పిటిషన్ను హై కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ కేసు ప్రత్యేక న్యాయమూర్తి ముందు వాదనలకు సిద్ధంగా ఉందని, ఈ తరు ణంలో స్టే కుదరదని స్పష్టం చేసింది.
లాలూ ప్రసాద్ బీహార్ ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్స్ తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇత ర ఆస్తులను లంచంగా తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ అభియోగాలతో ఆయనతో పా టు మరో 15 మందిపై 2022 మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబ రులో తొలి చార్జిషీట్ ను దాఖలు చేయగా.. 2023 జూలై 3న మరో చార్జిషీట్ సమర్పించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపుతోంది. జూన్ 2వ తేదీన ఈ కేసులో తర్వాతి విచారణ జరగనుంది.