calender_icon.png 30 June, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హెలెన్ కెల్లర్ 145వ జయంతి వేడుకలు

30-06-2025 01:49:05 AM

పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్, జూన్ 29 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, ప్రము ఖ మేధావి, మానవతావాది, దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కెల్లర్ 145వ జయంతిని ఆదివారం నగరంలోని టీఎన్జీవోస్ భవనంలో ఘనంగా నిర్వహించా రు. ముఖ్య అతిథి గా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆమె స్ఫూర్తిదాయక జీవితం, సమాజానికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.

అనంతరం అంధ ఉద్యోగుల సమస్యలపై మంత్రికి విన్నవించారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ను గజమాల, శాలువాలతో సన్మానించారు. అలాగే టీఎన్జీవో కేంద్ర సంఘంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్దార్ హర్మేందర్ సింగ్, మెన్నేని సందీప్ రావులను సత్కరించారు.

ఈ కార్య క్రమంలో రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్, కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్,

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్ జిల్లా నాయకులు రమేష్ గౌడ్, అరసవిల్లి రాజేశ్వరరావు, మహేష్, కామ సతీష్, గిరిధర్, వాస్తవి గౌడ్, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, అజయ్, నారాయణ, నరసయ్య, అస్గరుద్దిన్, తదితరులుపాల్గొన్నారు.