calender_icon.png 30 June, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేకుర్తి పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్

30-06-2025 01:50:41 AM

కొత్తపల్లి, జూన్ 29 (విజయ క్రాంతి): రేకుర్తి లోని విజయపురి కాలనీలో ఆది వారం నిర్వహించిన ఆషాఢమాసం పోచ మ్మ బోనాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి న రేందర్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ప్రతి సంవత్సరం కరీంనగర్‌లో అత్యంత వైభవంగా బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, అశోక్, తదిత రులుపాల్గొన్నారు.