19-08-2025 01:27:17 AM
హీరో ధర్మ మహేశ్ కేసు
శేరిలింగంపల్లి, ఆగస్టు 18: సినిమాల్లో హీరోగా నటిస్తున్న ధర్మ మహేష్.. ఇంట్లో భార్యకే విలన్గా మారాడు. అదనపు కట్నం కోసం వేధింపులు భరించలేక భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. గచ్చిబౌలి మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమో దు అయ్యింది. ‘సింధూరం’, ‘డ్రింకర్ సాయి’ హీరో మహేష్.. గౌతమి డబ్బుతో హోటల్ వ్యాపారం మొదలుపెట్టి దా న్నే తన పేరుమీదకు మార్చుకున్నాడని ఆరోపణ. సిని మాల్లో ఛాన్సులు రావడంతో జల్సాలు, షికార్లలో మునిగిపోయి భార్యపై శారీరక, మానసిక వేధింపులు పెంచాడని గౌతమి వాపోయింది. గతంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చినా మారని మహేష్ తాజాగా మళ్లీ కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.