15-10-2025 01:41:02 AM
నిన్ను బట్టలూడదీసి కొడుతా..
బెల్లంపల్లి, అక్టోబర్ 14: పెద్దపల్లి జిల్లా బీజేపీలో వివాదాలు భగ్గుమన్నా యి. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనే మంగళవారం ఇద్దరు సీనియర్ నాయకులు తిట్టుకోవడం బీజేపీలో సంచనలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్ ఇటీవలే కాంగ్రెస్ నాయకుల తప్పుడు కేసులు, వేధింపులు తాళలేక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు గ్రా మానికి వచ్చారు. కుటుంబాన్ని పరామర్శిస్తున్న క్రమంలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ ఇన్చార్జి గోమాస శ్రీనివాస్.. అక్కడే ఉన్న పెద్దపెల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతను అరేయ్ వెంకటేష్ అని సంబోధించారు. కింద కూర్చుని ఉన్న వెంకటేష్ నేత.. అరేయ్ అంటే చెంప పగలగొడతా అంటూ అందరి ఎదుటే గోమాస శ్రీనివాస్కు వార్నింగ్ ఇచ్చారు.
దీంతో గోమాస శ్రీనివాస్ బదులిస్తూ వెంకటేష్ నేతను బట్టలూడదీసి కొడతా అంటూ మీదికి వెళ్లబోయారు. కింద కూర్చొని ఉన్న వెంకటేష్ నేత.. గోమాస శ్రీనివాసును కొట్టేందుకు ముందుకెళ్లారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకొని వెంకటేష్ నేతను ఆపారు. ఆ తర్వాత కూడా ఇద్దరి మ ధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడి ముందే ఇద్దరు సీనియర్ నేత లు తిట్ల పురాణానికి తెరలేపడంతో నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.