10-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నారాయణ ఐఐటీ అకాడమీ ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్ 2025లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ క్యాంపస్లలో అడ్మిషన్లు సాధించినందుకు ఆ యా విద్యార్థులను నారాయణ యాజమాన్యం సన్మానించింది.
నారాయణ క్యాంపస్లో అందించిన అద్భుతమైన శిక్షణ, గైడెన్స్ కారణంగానే తాము అద్భుత విజయం సాధించి నట్టు విద్యార్థులు పేర్కొన్నారు. తమ విజయంలో నారాయణ పాత్ర మరపురానిదని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సీబీఐ మా జీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ పునీత్ కొత్తవ, జేడీ లక్ష్మీనారాయణతో చిట్చాట్ నిర్వహించారు.
ఆయన అడిగిన ప్రశ్నలకు జేడీ లక్ష్మీనారాయణ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు కలలు గనటమే కాకుండా వాటిని సాధించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర నారాయణ, కరణి నారాయణ, పునీత్ కొత్తవ, గంటా రవితేజ, రమా నారాయణ, గ్రూప్ అకడమిక్ హెడ్ పీ ప్రమీల పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.