calender_icon.png 10 September, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పుప్రభుత్వానికి చెంపపెట్టు

10-09-2025 12:59:49 AM

-బీజేపీ పోరాట ఫలితమే ఈ నిర్ణయం 

-జాబ్ క్యాలెండర్ విడుదల ఏమైంది?

-పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని అసమర్థత

-ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలి

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గూప్---- పరీక్షలను పునఃమూల్యా కనం చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం రాష్ర్ట ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. గ్రూప్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.

పరీక్ష నిర్వహణలో గందరగోళాన్ని సృష్టించి.. రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని తాము మొదటినుంచి చెబుతున్నామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించా రు. కేవలం మొండిపట్టుకు పోయి వేలాదిమంది అభ్యర్థుల జీవితాలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడిందని రాంచందర్‌రావు దుయ్యబట్టారు.

నోటిఫికేషన్ విడుదల నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం వరకు అన్నీ తప్పుడు విధానాలనే టీజీపీఎస్సీ అవలంబించిందని ఆయన ఆరోపిం చారు. గ్రూప్ అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకోకుండా రాష్ర్ట ప్రభుత్వం మొం డిగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు.

పరీక్ష నిర్వహణలో గందరగోళం, మూల్యాంకనంలో అవకతవకలపై అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమం త్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్‌తో సహా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష పోరాటం చేశారని రాంచందర్‌రావు గుర్తుచేశారు. భారతీయ జనతా యువమోర్చా నిరంతర పోరాటాలు కొనసాగించిందన్నా రు. ఒక పరీక్ష కేంద్రంలోని ఒకే గదిలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువమంది ఎంపికవ్వడం, మూల్యాంకనం పూర్తిగా లోపభూ యిష్టంగా నిర్వహించడంతో వేలాది మంది గ్రూప్- అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు.

ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైకో ర్టు ఈ స్థాయిలో మొట్టికాయలు వేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయబట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిరు ద్యోగ జీవితాలతో ఆడుకోవడం ఆపాలని హితవు పలికారు.