calender_icon.png 8 June, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలపరీక్షకు నిలిచిన హిందూయిజం!

08-06-2025 12:00:00 AM

వారు దేవాలయాలను తగులబెట్టారు. సంస్కృతాన్ని నిషేధించారు. పూజారులను చంపారు. కానీ, హిందూ మతం అంతర్ధానం కాలేదు. సుమారు 5,000 సంవత్సరాలుగా అది అనేకమంది కుట్రదారులను, వలసవాదులను, విమర్శకులను ఎదుర్కొంది. అయినప్పటికీ అది ఇప్పటికీ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నది. చరిత్రలో హిందూ మతం ఐదు దండయాత్రల నుంచి ఎలా బయటపడిందో, నేటికీ అది ఎందుకు వృద్ధి చెందుతుందో తెలుసుకుందాం.

పర్షియన్ సామ్రాజ్యవాదులతో మొదలు

క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే పర్షియన్ అచెమెనిడ్స్ సామ్రాజ్యవాదులు పురాతన భారతదేశం వాయువ్య ప్రాంతాన్ని అంటే ఇప్పటి ఆధునిక పాకిస్తాన్‌ను జయించారు. వారు కొత్త భాషలను, ఆచారాలను, గవర్నర్లను తీసుకు వచ్చారు. కానీ, అప్పటికే అక్కడ కొలువై ఉన్న వేద సంప్రదాయం వారి ఆక్రమణలకు, ఆగడాలకు కూలిపోలేదు.

అది మరింతగా గట్టి పడింది. యథావిథి గా నాటి ప్రజల యజ్ఞయాగాలు కొనసాగాయి. సంస్కృత భాష కాలక్రమంలో మరింతగా వృద్ధి చెందింది. సనాతన భారతీయ వేదశాస్త్రాలు ప్రబోధించిన ధర్మం కదలకుండా ఉంది. ఇది మొదటి పరీక్ష. 

“సరిహద్దులు లేకుండా హిందూ మతం మనుగడ సాగించగలదా?” అంటే సమాధానం- “అవును” అని చరిత్ర చెబుతున్నది. తర్వాతి దండయాత్ర .. అలెగ్జాండర్ ది గ్రేట్ హిందువులను జయించడానికి ప్రయత్నించాడు. ఆయన సైన్యాలు భారతదేశానికి చెందిన హిందూరాజుల నుంచి తీవ్ర ప్రతిఘటనలను, లోతైన ఆధ్యాత్మిక ఆలోచనా పరులను ఎదుర్కొన్నాయి. ఆనాటి గ్రీకు తత్వవేత్తలు ఒక విధంగా భారతీయ ఋషుల వంటివారే.

జిమ్నోసోఫిస్టు (నగ్నసా ధువులు)ల వలె మెలిగారు. అయితే, వారు హైందవ దేవాలయాలను నాశనం చేయలేదు. వారెవరూ హిందూమత ఆలోచనలను, తాత్తిక విచారాలతో ఆసక్తికరమైన చర్చలు జరిపారు. ఆ తర్వాతి కాలంలోని వారు గ్రీకులు. భారతీయ ఆలోచన వీరికంటే కూడా భారతదేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. ఈ పవిత్ర భూమిలో ఉపనిషత్తులు అరిస్టాటిల్ వంటి వారి చింతనలను మించిపోయాయంటే నమ్మక తప్పదు. 

ఉప్పెనలా వచ్చిన ఇస్లాం చక్రవర్తులు

8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఇస్లామిక్ ఆక్రమణదారులు ఒక ఉప్పెనవలె భారతదేశంలోకి చొచ్చుకుంటూ, దండెత్తి వచ్చారు-. ఘజనీ, ఘోరీ, తుగ్లక్‌లు, మొఘలులు.. ఇలాంటి వారి నాయకత్వంలో వేలకొద్దీ హైందవ దేవాలయాలు ధ్వంసమైనాయి. భారతీయ సాంస్కృతిక చిహ్నాలు నాశనమయ్యా యి. వేదశాస్త్రాలు, ధర్మానికి ప్రతీకలు వంటివారైన సంస్కృత పండితులు వారి సైన్యం చేతుల్లో దారుణ హత్యలకు గురయ్యారు.

ఆనాడు హిందూధర్మపరుల నోళ్ళు కుట్టివేసినంత పని చేశారు. సంస్కృత పాఠశాలలు అదృశ్యమైనాయి. గురుకులాలు బూడిద కుప్పలుగా మారాయి. కొన్ని ప్రాంతాలలో పవిత్రబంధంగా భావించే పెండ్లిళ్లు, హిందూమత ఆచార సంప్రదాయాలు నిషేధాలకు గురైనాయి. కానీ కాలం సత్యసంధతకు విలువ ఇస్తుందని నిరూపితమైంది. 

ప్రజల నాల్కలపై ప్రతిష్ఠితమైన భక్తి ఉద్యమం

మన భారతీయ వేద, పుణ్యభూమిలో వారు నాశనం చేయలేనిది ఒకటి ఉం దని వారికి తెలియదు. -అదే భక్తి ఉద్యమం! ఒకవైపు రాజులు పోరాడుతుండగా  మీరాబాయి, తులసీదాస్, కబీర్ వంటి మహాసాధువులు హిందూ మతాన్ని స్థానిక భాషలలో పద్యాలు, పాటల ద్వారా వీధుల్లోకి తీసుకెళ్లారు. రామనామం కేవలం పూజారి పద్యం వలె కాకుండా ప్రజల కీర్తనగా మారింది. వారు సనాతన శాస్త్రీయ సంస్కృత వాఙ్మయాన్ని సమాధి చేయడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే పరోక్షంగా ప్రజల నాలుకపై అదంతా భక్తి ప్రవాహమై కొలువుదీరింది.

ఆధునిక ఆధ్యాత్మిక వేత్తల పుణ్యమా అని!

కానీ, అప్పటికీ హిందూమతం మళ్ళీ కొత్త శక్తితో ఉద్భవించింది. స్వామి వివేకానంద చికాగో నడివీధిలో నిలబడి పశ్చిమ దేశాలను కదిలించాడు. దయా నంద సరస్వతి వేదాలను సరళంగా సామాన్యులకు అందేలా పునరుద్ధరించా డు. అరవిందులు భారతీయ ఆధ్యాత్మిక శక్తిని జాతీయ స్ఫూర్తితో మేల్కొల్పాడు. ఇలాంటి వారంతా మన గతాన్ని తిరిగి రాయడానికి ప్రయత్నించారు.

కానీ భారతదేశం దాని భవిష్యత్తును తిరిగి రాసింది. స్వాతంత్య్రం తర్వాత కూడా హిం దూమతం నిశ్శబ్ద దండయాత్రను, ఆధునిక అపహాస్యాన్ని ఎదుర్కోవడం మరో దురదృష్టకర పరిణామం. దేవాలయాలను మూఢ నమ్మకాలకు వేదికలుగా పిలిచేవారు సంస్కృతం చనిపోయినట్లు ప్రచారం చేశారు. 

వేదసంస్కృతి విస్తరిస్తున్నది!

పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో పడిన ఉన్నత వర్గాలలో సనాతన భారతీ య ధర్మం ఎగతాళికి లోనైంది. కానీ, మళ్ళీ ఏం జరిగింది? మనదైన భారతీయ యోగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. భగవద్గీత నాయకత్వ మంత్రంగా వికసించింది. దీపావళి వంటివి ప్రపంచ పండులుగాగా మారాయి. అయినా, జ్ఞానోదయం కాని వారు దానిని నిస్సిగ్గుగా తుడిచి వేయడానికి ప్రయత్నించారు. అయినాసరే, హైందవ ధర్మం సగర్వంగా నిలబడింది. ఇప్పుడు అసలైన ప్రశ్న సామాన్యుల్లో ఉద్భవిస్తుంది. 

ధార్మిక మహావృక్షం నీడలో!

‘హిందూ మతం 5,000 సంవత్సరాలుగా ఐదు దారుణమైన దండయాత్రలను ఎదుర్కొని కూడా ఎలా తట్టుకొని నిలబడగలిగింది?’ ఎందుకంటే ఇది కేవలం ఒక మతం కాదు, ఒక సజీవ మానవ నాగరికత కనుక. భారతీయ సనాతన ధర్మం అంటే ఒక మహోన్నతమైన మర్రిచెట్టు వంటిది అనుకోండి. అప్పుడు దాని కొమ్మలను నరికివేసినంత మాత్రాన ఏమవుతుంది? అది సరికొత్తగా వేళ్ళూనుకుంటుంది.

కాలం మాయలో పడినపుడు అది వంగి ఉండవచ్చు. కానీ, ఎప్పుడూ విరిగిపోలేదు. ఇంకా, ఎందుకంటే భారతీయ వేదధర్మం ఎవరో ఒక ప్రవక్త, ఓ పుస్తకం లేదా ఒక పాలకుడో నిర్మించింది కాదు. ఇప్పటికీ ఇది అద్భుతమైన ఆధ్యాత్మికమైన, ధార్మికమైన, పరమ పవిత్రమైన ప్రార్థన ద్వారా, శ్వాస ద్వారా, ఇంకా చెక్కు చెదరని కాలశక్తి ద్వారా కోట్లాదిమంది భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నివసిస్తున్నది.

సంస్కృతిని కలుషితం చేసిన బ్రిటీష్ పాలకులు

ఆఖరున మన దేశంపైకి ఫ్రెంచ్, పోర్చుగీసుల బాటలో బ్రిటిష్ వారు వచ్చారు. ప్రత్యేకించి బ్రిటిషు వారు స్థిరపడే కాలానికి రాజుల జమానా నశించింది. ఆధునిక సమాజాలు, ప్రజాస్వామ్యాలు అవతరించడం మొదలైంది. అందుకే, బ్రిటిషు వారు కత్తులతో దేవాలయాలను నాశనం చేయ లేదు. క్షేత్రస్థాయిలో హైందవ సంస్కృతిని నాశనం చేయడానికి ఉపక్రమించారు.

మన సాంస్కృతిక వారసత్వాలకు నెలవుగా ఉన్న పాఠశాలలను వారు తమ పావులుగా ఉపయోగించారు. పరమ పవిత్రమైన వేదాలను వారు ఆదిమమైనవి అంటూ అపహా స్యం చేశారు. వాటిని ‘వట్టి మూర్ఖ ఆచారాలు’ అని మసి పూశారు. ఆనాటి భారతీయ హిందూ గురుకులాల ను ఆంగ్ల మాధ్యమ సంస్థలతో భర్తీ చేశారు.