3 July, 2026 | 5:49 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్

26-07-2024 12:05 AM

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి వరంగల్‌లోని ఎస్‌ఆర్ విశ్వవిద్యాలయం గురువారం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. రంగస్థలం నుంచి రచయితగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన భరణి, సుమారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎనిమిది వందల పైచిలుకు చిత్రాల్లో నటించారు. రచయితగా 52 సినిమాలకు పనిచేసిన ఆయన, ‘మిథునం’తో దర్శకుడిగానూ మెప్పించారు. గతంలో సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు ఈ పురస్కారం అందించిన ఎస్‌ఆర్ విశ్వవిద్యాలయం, ఆగస్టు 3న జరుగనున్న స్నాతకోత్సవంలో తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్‌ను అందజేయనుంది.