ఉగాది పచ్చడి పంపిణీ
19-03-2026 02:53 PM
కాగజ్ నగర్, మార్చి 19విజయ క్రాంతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కాగజ్నగర్ రాజీవ్ చౌక్లో ఉగాది పచ్చడి(Ugadi Pachadi) పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ ఛైర్పర్సన్ సహీన్ సుల్తానా ప్రారంభించారు. శీతల పానీయాలు వద్దు – ప్రకృతి పానీయాలు ముద్దు అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. టౌన్ సీఐ ప్రేమకుమార్, టీఎస్ యూటీఎఫ్ సభ్యులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.




