07-06-2025 12:27:48 AM
జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు
సూర్యాపేట, జూన్ 6 (విజయక్రాంతి): భూ భారతితో రైతులకి మెరుగైన సేవలు అందించటం జరుగుతుందిని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేయనుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. బుధవారం నూతనకల్ మండలం తాళ్ళసింగారంలో జరిగిన రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సు233 మంది ధరఖాస్తులు సమర్పించారనీ తెలిపారు. రెవిన్యూ సదస్సులలో రైతులు తమ భూములకి సంబందించి అన్ని సర్టిపికెట్లు జత చేసి భూ సమస్యలను ధరఖాస్తు రూపంలో సమర్పించాలని తదుపరి అధికారులు క్షేత్ర స్థాయి లో విచారణ చేసి సమస్య పరిష్కరించటం జరుగుతుందన్నారు.
తదుపరి సోమ్లాతండా గ్రామంలోని రేషన్ దుకాణంను తనిఖీ చేసి ప్రజలు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సన్నబియ్యం మూడు నెలలకి సరిపడేవి ఒక్కేసారి పంపిణి చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. తదుపరి గ్రామంలోని పల్లెప్రకృతి వనంని సందర్శించి పండ్ల మొక్కలు ఎక్కువగా నాటలని సూచించారు. ఈ కార్యక్రమంలో, తహసీల్దార్ శ్రీనివాస్, కార్యదర్శి వెంకన్న అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.