30 July, 2026 | 8:38 PM

వర్షాలకు కూలిన ఇల్లు

30-07-2026 07:31 PM

మానకొండూరు,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెంకుటిల్లు కూలి నేల మట్టమయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో వడ్లకొండ పుష్పలతకు చెందిన పెంకుటిల్లు వర్షాలకు  కూలి పోయి సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కూలిపోయిన ఇల్లుని గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ పరిశీలించి, నిలువ నీడ లేక, గూడు కోల్పోయిన పుష్పలతకు ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.