09-04-2025 02:18:21 AM
ఆరా తీసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎలా నడుస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఆయన జనగామ మునిసిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
ఎల్ఆర్ఎస్కు 25 శాతం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగించుకోవాలని కోరారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ఆన్లైన్ విధానాన్ని నిశితంగా పర్యవేక్షించి, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులను తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని, అభ్యంతరాలు లేని వాటికి త్వరగా ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు రాయితీ గడువును పెంచిందని గుర్తు చేశారు. ఈ నెల 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎస్సీడీఓ విక్రమ్, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, టీపీఎస్ ప్రశాంతి ఉన్నారు.