09-04-2025 02:19:19 AM
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్
నల్లగొండ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించేందుకు ప్రతిపాదించిన ఏదుల- ఉల్పర లింక్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 1800.62 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిష్టంపల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు.
సమీక్షలో నల్లగొండ, నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, అమరేందర్,స్పెషల్ కలెక్టర్ నటరాజన్, నీటిపారుదల సీఈ అజయ్ కుమార్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను, చండూరు ఆర్డీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.