01-02-2026 01:26:33 AM
డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు వైద్యలింగం, మాజీమంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామి
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదు చ్చేరి రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ ప్రచా రం నిర్వహించేందుకు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పుదుచ్చేరి రాష్ట్ర క్యాపిటల్ సిటీ పాండిచ్చేరికి చేరుకున్నారు. పాండిచ్చేరి విమానాశ్రయంలో పీసీ సీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ వైద్య లింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథం ఘనస్వాగతం పలికారు.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 23 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయా త్ర ప్రస్తుతం శనివారానికి 21వ నియోజకవర్గమైన ఏం బులంకు చేరుకుంది. శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పాదయాత్రలో పాల్గొని అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో ముఖ్యఅతిథిగా ప్రసంగించనున్నారు.