15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా?

01-02-2026 01:31 AM
  1. సిట్ విచారణకు పిలిస్తే నిరసనలు ఎందుకు
  2. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిస్తే.. బీఆర్‌ఎస్ పార్టీ నిరసనకు ఎందుకు  పిలుపునిచ్చిందో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా..?   ఆయనను విచారించకూడదా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని, ట్యాపింగ్‌లో అత్యధికంగా లబ్ధిపొందింది కేసీఆరే అని అర్థమవుతోందన్నారు.

సిట్ ఏం అడుగుతుందో తెలియకుండానే బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువ హడావిడి చేస్తోందని, తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున కార్యకర్తలు రావాలని పిలుపునివ్వడం వెనుక కుట్ర కనిపిస్తోందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఒకవైపు విచారణకు సహకరిస్తామంటూనే .. మరోవైపు ఆందోళనలకు పిలుపు నివ్వడం ఎందుకు? విచారణ సమయంలో ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కల్గిస్తారన్న అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ విచారణ సమయంలో కూడా జూబ్లీహిల్స్ స్టేషన్ దగ్గర అల్లర్లు సష్టించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు.