15-06-2025 01:49:28 AM
- డీ కోడ్ చేస్తున్నామన్న మంత్రి రామ్మోహన్ నాయుడు
- 274కు చేరుకున్న మృతుల సంఖ్య
- 650 అడుగుల ఎత్తులో ఉన్నపుడే విమానం కూలిపోయింది: పౌరవిమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా
- మేడే... మేడే... మేడే... నో పవర్... నో థ్రస్ట్... గోయింగ్ డౌన్ అంటూ పైలట్ చివరి మెసేజ్
-కోటికి అదనంగా మరో 25 లక్షల పరిహారం ప్రకటించిన ఎయిరిండియా
అహ్మదాబాద్, జూన్ 14: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో లభించిన బ్లాక్ బాక్స్ సమాచారాన్ని అధికారులు డీకోడ్ చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు గల అసలు కారణాలను నిగ్గు తేల్చేందుకు ఉన్నతస్థాయి బహుళ క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ శనివారం ప్రకటించింది. ఈ కమిటీ మూడు నెలల్లో రిపోర్టు సమర్పించనుందని పేర్కొంది. ఎయిరిండియా ఏఐ 171 పేరును మారుస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పేరుతో సర్వీసులు నడపమని ప్రకటించింది.
విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కి చేరుకుంది. విమాన ప్రమాద మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎయిరిండియా శనివారం రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని ప్రకటించింది. ఇప్పటికే టాటా గ్రూపు రూ. కోటి పరిహారం ప్రకటించగా.. ఎయిరిండియా ప్రకటించిన ఈ సాయం అదనం. ప్రమాదానికి గురైన విమానంలోని సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభ్రావల్ పంపిన చివరి మెసేజ్ బయటికొచ్చింది. మే డే.. మే డే.. మే డే.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అనే సందేశాన్ని ఆయన ఏటీసీతో పంచుకున్నారు. మృత్యుంజయుడిగా మిగిలిన రమేశ్ విశ్వాస్ కూర్చున్న 11ఏ సీటు గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.
సమాచారం డీ కోడ్ చేస్తున్నాం..
కూలిపోయిన విమానంలో లభించిన బ్లాక్ బాక్స్ సమాచారాన్ని డీ కోడ్ చేస్తున్నట్టు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్లాక్ బాక్స్లో కీలకమైన సమా చారం ఉంటుందని భావిస్తున్నాం. ఆ సమాచారంతో విమానప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందని భావిస్తున్నాం. ఈ విమానప్రమాదాన్ని పౌరవిమానయాన శాఖ సీరియస్గా తీసుకుంది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగా రు.
పరిస్థితిని సమీక్షించేందుకు ఏఏఐబీ డీజీ వెంటనే ప్రమాదస్థలికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్ లభించింది. బ్లాక్బాక్స్లో ఉన్న సమాచారం ప్రమా దం గురించి లోతై న విశ్లేషణను అందిస్తుందని ఏఏఐబీ విశ్వసిస్తోంది. బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం కోసం మేమంతా కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఒక్కసారి బ్లాక్ బాక్స్ సమాచారం నిక్షిప్తమయ్యాక ఏఏఐబీ మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. విమానయానశాఖ కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది.
ప్ర మాదం జరిగినపుడు బోయింగ్ 787 సిరీస్ విమానాలను మరింత క్షు ణ్ణ ంగా తనిఖీలు చేయాలనుకున్నాం. బోయింగ్ 787 సిరీస్ విమానాల్లో మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డీజీసీఏ అన్ని విమానయాన సం స్థలకు ఆదేశాలిచ్చింది. భారత్లో ఈ సిరీస్కు చెం దిన 34 విమానాలు ఉన్నాయి. ఇదివరకే ఎనిమిది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. మిగతా విమానా ల్లో కూడా తనిఖీలు చేపట్టనున్నారు.’ అని పేర్కొన్నారు.
సెకండ్లలోనే కుప్పకూలింది: సమీర్ కుమార్ సిన్హా
విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం కూలిపోయిందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు. ‘జూన్ 12 మధ్యాహ్నం 2 గంటల ప్రాం తంలో అహ్మదాబాద్ విమానప్రమాదం గురించి మాకు సమాచారం అందింది. వెంటనే అహ్మదాబాద్ ఏటీసీ ద్వారా పూర్తి వివరాలు కనుక్కున్నాం. 242 మందితో లండన్కు వెళ్తున్న ఏఐసీ 171 విమా నం కూలిపోయిందని వారు తెలిపారు. మధ్యాహ్నం 1.39కి బయల్దేరిన విమానం 650 అడుగుల ఎత్తుకు చేరుకుని అక్కడి నుంచి క్రమంగా పడిపోయింది. మేడే.. అని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. ఏ టీసీ వాళ్లు పైలట్ను సంప్రదించినా స్పందన రా లేదు. విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరం లో విమానం కూలిపోయింది.’ అని తెలిపారు.
పైలట్ చివరి సందేశం
ఎయిరిండియా ఏఐ 171 విమాన సీనియర్ పైలట్ చివరగా ఏటీసీకి పంపిన సందేశం బయటికొచ్చింది. ఐదు సెకండ్ల మెసేజ్లో మూడు సార్లు మేడే అని పైలట్ అన్నారు. ‘మేడే... మేడే... మేడే... నో పవర్.. నో థ్రస్ట్ (ఎగిరే శక్తి).. గోయింగ్ డౌన్’ అని మెసేజ్లో పేర్కొన్నాడు.
మరో 25 లక్షల తాత్కాలిక పరిహారం
బాధిత కుటుంబాలకు ఎయిరిండియా శనివారం రూ. 25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని ప్రకటించింది. ఈ సాయం బాధిత కుటుంబాల ఆర్థిక అవసరాలను తీరుస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. వి మానప్రమాద మృతులకు టాటా సన్స్ ఇప్పటికే రూ. కోటి పరిహారం ప్రకటించింది. ఈ 25 లక్షలతో కలిపి పరిహారం కోటి 25 లక్షలకు చేరుకుంది.
11ఏ సీటు అత్యంత సురక్షితం!
విమానంలోని 11ఏ సీటు అత్యంత సురక్షితమనే చర్చ నడుస్తోంది. మొన్నటి ప్రమాదంలోనే కాకుండా 1998లో థాయ్లాండ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కూడా 11ఏ సీటులో కూర్చుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. థాయ్లాండ్కు చెందిన జేమ్స్ అనే సింగర్ ఆనాటి ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అహ్మదాబాద్ విమానప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. విమానం కూలిన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్కు దగ్గర్లో టీస్టాల్ నిర్వహిస్తున్న మహిళకు 14 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. విమానం కూలిన సమయంలో ఆ మహిళ పరుగెత్తుకొని వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. కానీ ఆమె కుమారుడు మాత్రం మంటల్లో కాలిపోయాడు. ఆమె కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఏఐూ ఇక కనిపించదు
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐరో 171 విమానసర్వీసును నిలి పివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. విమాన ప్రమాద మృతులకు గౌరవా ర్థంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొం ది. ఈ విమానం స్థానంలో ఏఐ నంబర్ విమానం నడపనున్నట్టు ప్రకటించింది. ఏఐ విమానం జూన్ 17 నుంచి అహ్మదాబాద్ (లండన్) మధ్య సేవలందించనుందని ప్రకటించింది.
11 మందితో ఉన్నతస్థాయి కమిటీ
విమానప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు ప్రభుత్వం శనివారం 11 మందితో ఉన్నతస్థాయి బహుళ కమిటీని ఏర్పాటు చేసింది. ‘ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ప్యానల్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధాలు (ఎస్వోపీలు), భద్రతా మార్గదర్శకాలను మూల్యాంకనం చేస్తుంది. భవిష్యత్లో ఇలాంటి ఘోర విమాన ప్రమాదాలను నివారించడానికి అవసరమైన సూచనలు చేస్తుంది. ఈ కమిటీ స్వతంత్రంగా పని చేస్తుంది.
సంబంధిత సంస్థలు నిర్వహించే ఇతర విచారణలకు ఈ కమిటీ ప్రత్యామ్నాయంగా ఉండదు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు కావాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు రూపొందించడంపై కమిటీ దృష్టి పెడుతుంది.’ అని పౌరవిమానయాన శాఖ తెలిపింది. హోం శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన 11 మందితో ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును మూడు నెలల్లో సమర్పించాలని మంత్రిత్వ శాఖ డెడ్లైన్ విధించింది.
గత రెండు రోజులు కష్టంగా గడిచాయి. అహ్మదాబాద్లో జరిగిన విమానప్రమాదం మొత్తం దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్య క్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నేను కూడా రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయాను. మృతుల కుటుంబాల బాధను అర్థం చేసుకోగలను.