calender_icon.png 8 May, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్‌లో హెచ్‌పీబీ -ఆంకో ఎక్సలెన్స్ సిమ్పోజియం

20-04-2025 12:00:00 AM

కాలేయ, క్లోమ, పిత్త మార్గాల క్యాన్సర్ ఆధునిక చికిత్సలపై చర్చ

హైదరాబాద్, ఏప్రిల్ 19: మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో హెచ్‌పీడీ -ఆంకో ఎక్సలెన్స్ సిమ్పోజియాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 400కు పైగా వైద్య నిపుణులు పాల్గొని కాలేయం, క్లోమగ్రంథి, పిత్తమార్గాల క్యాన్స ర్ల నిర్ధారణ, చికిత్సల్లోని తాజా పురోగతులపై చర్చించారు.

సర్జికల్, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వంటి బహుళశాఖల నుంచి ప్రము ఖ వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డాక్టర్ రవిచంద్ర వెలిగేటి, డాక్టర్ సరితా శ్రీవస్తవ్, డాక్టర్ అమిత్ జోత్వానీ, డాక్టర్ అరుణ్ అరోరా మొదలైన వారు తమ విశిష్టమైన అనుభవాలను పంచుకున్నారు.

సదస్సులో హెపటోసెల్యులర్ కార్సినోమా, పిత్త మార్గా ల క్యాన్సర్లు, క్లోమగ్రంథి క్యాన్సర్ వంటి సంక్లిష్ట రోగాలపై ఆధునిక చికిత్సా పద్ధతు లు, కేస్ స్టడీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలపై చర్చించారు.

ఈ సందర్భం గా మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శరత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘ఇలాంటి సదస్సులు వివిధ వైద్య శాఖల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప వేదిక. తాజా పరిశోధనలు, అనుభవాలను పంచుకోవడం ద్వారా రోగులకు మరింత సమగ్రమైన, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించగలుగుతాం’ అని పేర్కొన్నారు.