16 March, 2026 | 10:56 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పిట్లం తై బజార్ వేలంలో భారీ ధరలు..

17-03-2025 06:28 PM

కైవసం చేసుకున్న ఎల్లారెడ్డి వాసి..

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం తై బజార్ వేలం ఘనంగా సాగింది. ఎంపీడీవో కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేలంలో నలుగురు పాల్గొని హోరాహోరీగా పోటీ పడ్డారు. చివరకు రూ.12.52 లక్షల భారీ ధరకు ఎల్లారెడ్డికి చెందిన రామ గౌడ్ విజయదండం ఎగురవేశారు. ఇదే విధంగా పశువుల వ్యాపారం విభాగంలో ఐదుగురు పాల్గొన్న వేలంలో పత్తి హరీష్ రూ. 6.58 లక్షల భారీ బిడ్డింగ్‌తో గెలిచారు. పంచాయతీ కార్యదర్శి బల్రాం మాట్లాడుతూ... ఈ సంవత్సరపు ధరలు గత ఏడాది కన్నా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.